Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 38-32తో యుపీ యోధాపై గెలుపు
పుణె : చావో రేవో తేలాల్సిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ నెగ్గి యుపీ యోధాకు షాకిచ్చింది. ఆదివారం జరిగిన కబడ్డీ పోరులో రోహిత్ కుమార్ 12 రైడ్ పాయింట్లు, మహేందర్ సింగ్ 10 టాకిల్ పాయింట్లతో రాణించి బెంగళూరుకు విజయాన్నందించారు. తొలి భాగం ఆరో నిమిషం దాకా ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచినా రోహిత్ మ్యాచ్ను బెంగళూరువైపు తిప్పాడు. ఆపై పట్టు కోల్పోని బుల్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో గెలిచింది. యుపీలో సురేందర్ సింగ్ 10 రైడ్ పాయింట్లు, నితేష్ కుమార్ నాల్గు టాకిల్స్ సాధించారు. మరో మ్యాచ్లో 34-31తో దబంగ్ ఢిల్లీపై పుణెరి పల్టన్ విజయం సాధించింది.