Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమ్ ఇండియా ఇటీవల వరుస విజయాలతో ఔరా అనిపిస్తోంది. క్రికెట్ జట్టుగా ఆడే ఆట. ఒకరిద్దరి ప్రదర్శనలపై విజయాలైతే సాధించవచ్చు గానీ నిలకడ సాధ్యం కాదు. కోహ్లిసేన వరుస విజయాలకు జట్టుగా ఆడే స్వభావమే ప్రధాన కారణమని ఓపెనింగ్ బ్యాట్స్మన్, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ' విజయాల ఘనత అందరికీ దక్కుతుంది. వరుసగా ఆరు సిరీస్ విజయాలు సాధించామంటే అందుకు కారణం, జట్టుగా ఆడటమే. నువ్వు ఓ నగరానికి ఆడుతున్నావా? లేదా దేశానికి ఆడుతున్నావా అనే విషయంతో సంబంధం లేదు, ఓ మ్యాచ్లో విజయం సాధించాలంటే సాధారణ విషయం కాదు. టోర్నీలు నెగ్గాలంటే ఒకరిద్దరి మెరుపులతో వీలు పడదు. జట్టుగా ఆడితేనే అది సాధ్యపడుతుంది. జట్టుగా ఆడే క్రీడలో అందరూ తమ వంతు పాత్ర పోషించటం ఎంతో కీలకం' అని రోహిత్ అన్నాడు. 2019 ప్రపంచకప్కు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నది. వరల్డ్కప్పై మాట్లాడటానికి ఇంకా సమయం ఉన్నది. మా జట్టు ప్రపంచకప్ సన్నద్ధంలో ఉన్నదనే విషయం వాస్తవమని రోహిత్ తెలిపాడు. ముంబయిలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ శర్మ మీడియాతో ముచ్చటించాడు. ఈ కార్యక్రమంలో క్రికెటర్ లోకేశ్ రాహుల్ సహా తెలంగాణ బాక్సర్ నికత్ జరీన్ సైతం పాల్గొన్నారు.