Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైసూర్ : క్రిష్ణప్ప గౌతమ్ (4/20, 3/39), వినరు కుమార్ (2/17, 4/31)లు మూడో రోజూ చెలరేగటంతో అస్సాం రెండో ఇన్నింగ్స్లో 203 పరుగులకే ఆలౌట్ అయింది. కర్నాటక ఇన్నింగ్స్ 121 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. రైల్వేస్పై ఇన్నింగ్స్ 105 పరుగులతో గెల్చిన ఢిల్లీ 10 పాయింట్లతో గ్రూప్లో టాప్లో ఉండగా, ఏడు పాయింట్లతో కర్నాటక రెండో స్థానంలో ఉన్నది. గ్రూప్ బిలో గుజరాత్ నాల్గు వికెట్ల తేడాతో కేరళపై గెలుపొందింది. ఫాలో ఆన్ ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు కోల్పోయి 332 పరుగులు చేసిన జార్ఖండ్, రాజస్థాన్తో మ్యాచును డ్రా చేసుకున్నది. గ్రూప్ సిలో తమిళనాడు, త్రిపురల మ్యాచ్ డ్రా అయింది. చత్తీస్ఘడ్పై ఇన్నింగ్స్ 160 పరుగులతో నెగ్గిన బెంగాల్ గ్రూప్ డి లో అగ్రస్థానంలో ఉన్నది. ఇన్నింగ్స్ 117 పరుగులతో పంజాబ్పై గెల్చిన విదర్భ ఏడు పాయింట్లతో గ్రూప్లో రెండో స్థానంలో నిలిచింది.