Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుపీపై 64-24తో బుల్స్ ఘనవిజయం
పుణె : రోహిత్ కుమార్ రఫ్ఫాడించటంతో బెంగళూరు చేతిలో యుపీ ఘోర పరాజయం చవి చూసింది. యుపీ డిఫెన్స్ను చీల్చి చెండాడిన రోహిత్ 32 పాయింట్లతో అదరగొట్టి, బుల్స్కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ప్రొ కబడ్డీ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన రైడర్గా రోహిత్ చరిత్ర సృష్టిం చాడు. కాగా ఈ సీజన్లో అత్యధిక పాయింట్లు నెగ్గిన జట్టుగా బెంగళూరు బుల్స్ రికార్డు నెలకొల్పింది. ముంబయి భారీ వర్షాల కారణంగా రద్దయిన మ్యాచ్ మంగళ వారం నిర్వహించారు. డిఫెండర్ రవీందర్ పాహాల్ ఏడు టాకిల్స్తో ఆకట్టుకున్నా డు. మరో మ్యాచ్లో 31-27తో హర్యానా స్టీలర్స్, పుణెరి పల్టన్ని ఓడించింది.