Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వాలిఫైయర్స్ నెగ్గి ప్రధాన టోర్నీలో అడుగు
- నిరాశపర్చిన కశ్యప్ ొడెన్మార్క్ ఓపెన్
ఒడెన్సె (డెన్మార్క్) : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ శుభంకర్ డే డెన్మార్క్లో శుభారంభం చేశాడు. క్వాలిఫైయర్స్ నెగ్గి ప్రధాన టోర్నీలో ప్రవేశించాడు. తొలి అర్హత పోరులో డెన్మార్క్ కుర్రాడు కిమ్ బ్రూన్ను 21-12, 13-21, 21-15తో ఓడించాడు. రెండో మ్యాచ్లో 21-17, 13-21, 21-19తో రాస్మస్(డెన్మార్క్)పై గెల్చాడు. మరో సింగిల్స్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ నిరాశపర్చాడు. తొలి పోరులో 21-13, 21-16తో లోకల్ స్టార్ విక్టర్ స్వెండ్సెన్ను ఓడించినా, టకుమా యుడా (జపాన్) చేతిలో 21-4, 21-19తో రెండో పోరులో పరాజయం పాలయ్యాడు. తొలి సెట్లో చెత్తగా ఆడిన కశ్యప్ రెండో సెట్లో పుంజుకున్నట్టు కనిపించినా, చివరి నిమిషాల్లో తడబడి ఓడాడు. మిక్స్డ్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, అశ్విని రెడ్డి పొన్నప్పల మిక్స్డ్ జోడీ మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. తొలి క్వాలిఫైయర్స్లో డెన్మార్క్ జంట క్రిస్టోఫర్ నడ్సెన్, ఇసబెల్లా నీల్సెన్లను 21-17, 21-13తో ఓడించారు. రెండో క్వాలిఫైయింగ్ పోరులో జర్మనీ జోడీ జోన్స్ రాల్ఫీ జన్సెన్, ఈవా జన్సెన్స్లపై 21-8, 21-13తో నెగ్గారు.