Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖరారు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో : 40 మంది కాంట్రాక్టు ఆటగాళ్లు పాకిస్థాన్తో సిరీస్ వేదిక విషయంపై పునరాలోచన చేయాలని క్రికెట్ బోర్డుకు లేఖ రాసినా, శ్రీలంక క్రికెట్ బోర్డు అవేవీ పట్టించుకున్నట్టు లేదు!. ఆటగాళ్లు విన్నవించిన రెండు రోజుల్లోనే అక్టోబర్ 29న శ్రీలంక జట్టు లాహోర్లో అడుగుపెడుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. 2009లో లాహోర్లో శ్రీలంక క్రికెట్ జట్టు బస్పై ఉగ్రదాడి తర్వాత ఏ అంతర్జాతీయ జట్టూ పాక్లో పర్యటించడానికి సాహసం చేయలేదు. కానీ ఐసీసీ చొరవతో ఇటీవల వరల్డ్ ఎలెవన్తో టీ20 సిరీస్తో ఆడించి, పాక్ గడ్డపై క్రికెట్కు పునజీవం పోసే ప్రయత్నం జరిగింది. వన్డే కెప్టెన్ ఉపుల్ తరంగ సహా సీనియర్ ఆటగాళ్లు పాక్కు వెళ్లేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. సెలక్టర్లు త్వరలోనే శ్రీలంక జట్టును ప్రకటించనున్నారు. శ్రీలంక జట్టుతో పాటు క్రికెట్ బోర్డ్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల సైతం లాహోర్ వెళ్లనున్నాడు. వరల్డ్ ఎలెవన్కు కల్పించిన భద్రతనే శ్రీలంక జట్టుకూ కల్పించనున్నట్టు పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
రెండో వన్డేలో పాక్ విజయం
తటస్థ వేదిక అబుదాబిలో జరుగుతున్న వన్డే సిరీస్లో పాకిస్థాన్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. వరుసగా రెండో వన్డేలోనూ శ్రీలంకపై గెలుపొందిన పాక్ సిరీస్ విజయానికి చేరువైంది. బాబర్ ఆజాం (101), షాదాబ్ ఖాన్ (52) రాణించటంతో పాక్ 219 పరుగులు చేసింది. ఛేదనలో ఉపుల్ తరంగ (112) శతకబాదినా శ్రీలంక 187 పరుగులకే కుప్పకూలింది. షాదాబ్ ఖాన్ (3/47) రాణించాడు. మూడో వన్డే బుధవారం జరుగనున్నది.