Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిక్స్డ్ డబుల్స్ అర్హత రౌండ్లో గెలుపు
ఫూజౌ (చైనా) : అశ్విని పొన్నప్ప, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డిల మిక్స్డ్ డబుల్స్ జోడీ చైనా ఓపెన్లో శుభారంభం చేసింది. వరుస అర్హత మ్యాచుల్లో గెలిచిన భారత్ జంట ప్రధాన డ్రాలో అడుగుపెట్టింది. తొలి క్యాలిఫైయర్లో తైవాన్ జంట లీ జీహుయె, వు టీజంగ్లను 24-22, 21-7తో ఓడించింది. నిక్లాస్ నోహర్, శారా తైగేసెన్ల డెన్మార్క్ జంట రెండో అర్హత పోరులో పొన్నప్ప జోడీకి గట్టి పోటీనిచ్చింది. ఆరంభంలో తడబడినా పుంజుకున్న భారత జంట 21-16తో తొలి సెట్ కైవసం చేసుకున్నది. 21-19తో రెండో సెట్ నెగ్గిన డెన్మార్క్ జంట ఆటను మూడో సెట్కు తీసుకెళ్లగా.. 18-20తో వెనుకబడిన పొన్నప్ప జోడీ వరుసగా నాల్గు పాయింట్లు నెగ్గి 22-20తో నిర్ణాయక సెట్నూ వశం చేసుకున్నది. ప్రీ క్వార్టర్స్లో స్థానం కోసం నేడు మథియస్ క్రిస్టియన్సెన్, క్రిస్టీనా పెడర్సెన్ల డెన్మార్క్ జంటతో తలపడనున్నది. పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్ అర్హత రౌండ్ నుంచి వైదొలిగాడు.