Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్షిప్
దోహా : ఐబీఎస్ఎఫ్ ప్రపంచ చాంపియన్షిప్లో పంకజ్ హవా సాగుతున్నది. 17వ ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ సాధించిన జోష్మీదున్న పంకజ్ ఇదే టోర్నీలో మరో పతకం సాధించాడు. లాంగ్ అప్ ఫార్మాట్లో పంకజ్ అద్వాణీ కాంస్య సొంతం చేసుకున్నాడు. సెమీస్ బరిలోకి దూసుకెళ్లిన భారత ఏస్ బిలి యర్డ్స్ ఆటగాడు రజతం నెగ్గుతాడని భావించినా.. మైక్ రస్సెల్ (ఇంగ్లాండ్) చేతిలో 620-1251తో ఓడిన పంకజ్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. నేటి నుంచి జరగనున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో పంకజ్ పతకవేట చేయనున్నాడు.