Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగిల్స్, డబుల్స్లో క్వార్టర్స్లో అడుగు
- క్వార్టర్స్లో యుకీ, రామ్కుమార్
పుణె : తెలుగుతేజం సాకేత్ మైనేని పుణె చాలెంజర్లో సత్తా చాటుతున్నాడు. వైల్డ్ కార్డ్తో పుణె చాలెంజర్లో అడుగు పెట్టిన మైనేని ఎనిమిదో సీడ్ పెడా కిరిస్టిన్ (సెర్బియా)ను 4-6 ,6-2, 6-0తో ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. డబుల్స్లో జీవన్ నెడుంచెడియాన్ జతగా 6-3, 6-4తో మరో భారత్ జంట బాలాజీ, వర్ధన్లను ఓడించి క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. మూడో సీడ్ యుకీ బాంబ్రీ ప్రీ క్వార్టర్స్లో ఆంటె పావిక్ (క్రొయేషియా)ను 6-4, 7-6తో వరుస సెట్లలో మట్టికరిపించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బ్రైడెన్ క్లెయిన్ను నాల్గో సీడ్ రామ్కుమార్ రామనాథన్ 7(9)-6(7), 6-3తో ఓడించి క్వార్టర్స్్లో కాలుమోపాడు. విజరు సుందర్ ప్రశాంత్, సుమిత్ నాగల్లు ప్రీ కార్టర్స్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.