Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్లో హాన్ యూపై 2-0తో గెలుపు
- సైనా, ప్రణయ్లకు నిరాశ
ఫూజౌ (చైనా) : తెలుగు తేజం పి.వి సింధు చైనా ఓపెన్ క్వార్టర్స్ చేరిన ఏకైక భారత షట్లర్గా నిలిచింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో చైనా అమ్మాయి హాన్ యూపై 21-15, 21-13తో గెలుపొందింది. తొలి రౌండ్లో దూకుడుగా ఆడిన సైనా ప్రీ క్వార్టర్స్లో 18-21, 11-21తో అకానె యమగూచి (జపాన్)కు తలవంచింది. పురుషుల సింగిల్స్లో భారత్ ఆశల భారం మోస్తాడనుకున్న ప్రపంచ 11వ ర్యాంకర్ హెచ్.ఎస్ ప్రణరు నిరాశపర్చాడు. ప్రీ క్వార్టర్స్ సమరంలో 19-21, 17-21తో లీ చ్యుక్యు చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ఒలింపిక్ సిల్వర్ స్టార్ సింధు ప్రీ క్వార్టర్స్్ మ్యాచ్ను 39 నిమిషాల్లోనే ముగించింది. తొలి సెట్లో 5-0, 11-8తో ఆధిక్యంలో నిలిచిన హైదరాబాదీ ఆపై జోరు పెంచి 21-15తో తొలి సెట్ సొంతం చేసుకున్నది. రెండో సెట్లోనూ 6-0 ఆధిక్యంతో దూసుకొచ్చిన సింధుకు హాన్ ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. 21-13తో రెండో సెట్ వశం చేసుకున్న సింధు క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నది. సెమీస్లో స్థానం కోసం చైనా యువతి గావో ఫాంగ్జీతో తలపడనున్నది. ఏడాదిలో యమగూచి చేతిలో మూడుసార్లు ఓడిన సైనా నెహ్వాల్ చైనాలో మరోసారి జపాన్ అమ్మాయి ముందు తడబడింది. తొలి సెట్లో గట్టిపోటీనిచ్చినా, రెండో సెట్లో ప్రభావం చూపలేకపోయింది.