Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ నేటి నుంచి జరుగునున్న మహారాష్ట్రతో ఢిల్లీ రంజీ మ్యాచ్లో ఆడనున్నాడు. ఈ మేరకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ మేనేజర్ వెల్లడించారు. శ్రీలంకతో టెస్టు సిరీస్కు 15 మందితో కూడిన జట్టులో ఇషాంత్ సభ్యుడు. కానీ టీమ్ ఇండియా నూతన విధానం ప్రకారం తుది జట్టులో లేని ఆటగాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు వీలున్నది. ఈడెన్ టెస్టు తుది జట్టులో లేని ఇషాంత్ టీమ్ ఇండియా బాధ్యతల నుంచి తప్పుకుని, రంజీల్లో ఢిల్లీకి సారథ్యం వహించనున్నాడు. గత ఆరు ఇన్నింగ్స్ల్లో 15 వికెట్లు కూల్చిన ఇషాంత్ ఈ సీజన్లో ఢిల్లీ రంజీ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే.