Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ ఐదేండ్ల కార్యాచరణ ప్రతిపాదన
ముంబయి : మరో మాసం రోజుల్లో టెస్టు, వన్డే లీగ్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ సిద్ధం చేసే యోచనలో ఐసీసీ నిమగమై ఉండగా, బీసీసీఐ రానున్న ఐదేండ్ల కార్యాచరణలో నాల్గు నెలలను రిజర్వ్ చేసుకున్నది!. భారత క్రికెట్ జట్టు రానున్న ఐదేండ్లలో ఆడనున్న క్రికెట్ సిరీస్లపై డిసెంబర్ 1న జరిగే ఎస్జీఎంలో చర్చించ నున్నారు. కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే విషయంపై బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, మాజీ జనరల్ మేనేజర్ ఎం.వీ శ్రీధర్ (ఇటీవల గుండెపోటుతో మరణించారు) ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. దీని ప్రకారం ఏడాదిలో ఫిబ్రవరి-మార్చి తోపాటు అక్టోబర్-నవంబర్లను స్వదేశీ సీజన్ కోసం రిజర్వ్ చేశారు. ఈ మేరకు ఐసీసీకి బోర్డు ప్రతి పాదనలు పంపనున్నది. 2019 నుంచి టెస్టు, వన్డే లీగ్లు ఆరంభం కానున్న నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణపై ఐసీసీ కసరత్తు చేస్తోంది. ఈ నాల్గు మాసాలు కాకుండా మిగ తా సమయంలో విదేశీ పర్యటనలకు భారత్ వెళ్తుంది. గత కొన్నేండ్లుగా ఈ నాల్గు మాసా ల్లోనే టీమ్ ఇండియా స్వదేశీ సీజన్లో క్రికెట్ ఆడుతోంది. దీనికి తోడు ఏప్రిల్-మే లలో ఐపీఎల్ ఉంటుంది. ఐపీఎల్ కలుపుకుంటే ఏడాది క్యాలెండర్లో బీసీసీఐ ఆరు నెలలను రిజర్వ్ చేసుకున్నది. ఎస్జీఎంలో దీనికి ఆమోద ముద్ర పడనున్నది.