Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్లో 2-0తో మైనేనిపై విజయం
పుణె : స్వదేశంలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో భారత ఆటగాళ్ల హవా కొనసాగుతున్నది. సెమీస్ బరిలో తెలుగు తేజం సాకేత్ మైనేనిపై నాల్గో సీడ్ రామ్కుమార్ రామనాథన్ 6-3, 6-2తో వరుస సెట్లలో గెలుపొందాడు. మరో సెమీ సమరంలో రెండో సీడ్ మెనెండెజ్ (స్పెయిన్)ను మూడో సీడ్ యుకీ బాంబ్రీ 6-2, 6-4తో కంగు తినిపించాడు. టైటిల్ ఫైట్లో రామ్కుమార్, యుకీలు నేడు తలపడనున్నారు. డబుల్స్లో మైనేని జోడీ స్పెయిన్ జంట చేతిలో 6-4, 6-4తో ఓటమిపాలైంది.