Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ రెజ్లింగ్ చాంపియన్షిప్
ఇందోర్ : హాట్ ఫేవరెట్గా కుస్తీ బరిలోకి దిగిన సుశీల్ కుమార్ పసిడిపోరుకు అర్హత సాధించాడు. రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ రెండో రోజు నాల్గు వరుస విజయాలతో చెలరేగాడు. తొలి రౌండ్లలో రెండు నిమిషాల్లోపే ప్రత్యర్థులను మట్టి కరిపించాడు. క్వార్టర్స్లో ప్రవీణ్, సెమీస్లో సచిన్ దహియాలు వాకోవర్ ఇవ్వటంతో నేరుగా ఫైనల్కు చేరుకున్నాడు. మహిళల 62 కిలోల విభాగంలో సాక్షి మాలిక్, 59 కిలోల విభాగంలో గీతా ఫోగట్లు సైతం బంగారు పోరులో నిలిచారు.