Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో రామ్కుమార్పై 2-1తో విజయం
- పుణె ఏటీపీ చాలెంజర్
పుణె : భారత టాప్ టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ సీజన్లో తొలి టైటిల్ అందుకున్నాడు. చివరిసారిగా 2015లో పుణె చాలెంజర్ టైటిల్ అందుకున్న యుకీ రెండేండ్ల తర్వాత మరోసారి పుణె ఓపెన్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన తుదిపోరులో సహ ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ను 4-6, 6-3, 6-4తో ఓడించాడు. రెండు గంటలకు పైగా జరిగిన హోరాహోరీ పోరులో తనకన్నా మెరుగైన ర్యాంకర్ యుకీకి రామ్కుమార్ తలవంచాడు. తొలి సెట్ 4-6తో కోల్పోయిన మూడో సీడ్ యుకీ 6-3తో రెండో సెట్ సొంతం చేసుకున్నాడు. నిర్ణాయక తుది సెట్లో 1-0, 3-2తో ఆధిక్యంలో నిలిచినా 3-3, 4-4తో రామ్కుమార్ స్కోరు సమం చేశాడు. ఈ సమయంలో నిలకడగా ఆడిన యుకీ 6-4తో తుది సెట్నూ పుణె ఓపెన్ సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.