Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమ్ ఇండియా ఆటగాళ్లకు శిక్షణా శిబిరం (కండీషనింగ్ క్యాంప్) నిర్వహిస్తామని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపాడు. డిసెంబర్ 24న శ్రీలంకతో ఆఖరి టీ20 ముగిసిన నాల్గు రోజుల్లోనే దక్షిణాఫ్రికాకు బయల్దేరాల్సి ఉన్నది. బెంగళూర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తొలుత టెస్టు స్పెషలిస్ట్లకే క్యాంప్ అనుకున్నా, ప్రస్తుతం అందరికీ వర్తింపజేయాలని ఆలోచిస్తున్నారు. కోహ్లిసేన దక్షిణాఫ్రికాలో సుమారు రెండు నెలలు పర్యటించనున్నది.