Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోని భవిష్యత్ చర్చపై కపిల్
హైదరాబాద్ : ఎం.ఎస్ ధోని టీ20 కెరీర్పై జరుగుతున్న రాద్దాంతంపై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. మహి భవిష్యత్పై నిర్ణయం తీసుకునే అవకాశం సెలక్టర్లకు వదిలేయండని, అతడి విమర్శకులకు పరోక్ష చురకంటిం చాడు!. ' ఎవ్వరూ జీవితకాలం ఆడలేరు. నాకు తెలిసి ధోని మంచిగా ఆడుతున్నాడు. మిగతా విషయం, సెలక్టర్లకు వదిలేయండి. ఈ విషయంలో మనకంటే వారే (సెలక్టర్లు) ఉత్తమ నిర్ణయం తీసుకుంటారు' అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. నా అభిప్రాయం చెబితే, అభిమానుల్లో గందరగోళం ఉంటుంది. ఆ పని నేను చేయను. ధోని ఆడాలా? వద్దా అనేది సెలక్టర్లకు తెలుసు. వాళ్ల పనిని చేయనీయండని కపిల్ అన్నాడు. ఈ సమయంలో ధోని టీ20 కెరీర్ను ప్రశ్నించిన వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్లు కపిల్ దేవ్తో పాటే ఉండటం విశేషం.