Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈడెన్లో భారత పేసర్లు అరుదైన ఘనత సాధించారు. సుమారు మూడు దశాబ్దాల విరామం తర్వాత స్వదేశి టెస్టులో ఓ ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు కూల్చారు. ఈడెన్లో భువనేశ్వర్, మహ్మద్ షమిలు చెరో నాల్గు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు కూల్చాడు. చివరగా 1983లో అహ్మదాబాద్లో వెస్టిండీస్తో టెస్టులో కపిల్ దేవ్ తొమ్మిది, బల్విందర్ సందూ ఓ వికెట్ తీసుకున్నారు. అంతకముందు వాంఖడెలో ఇంగ్లాండ్పై (1982) కపిల్ దేవ్, మదన్లాల్లు చెరో ఐదు వికెట్లతో స్పిన్నర్ల సాయం లేకుండానే ప్రత్యర్థిని కుప్పకూల్చారు.