Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈడెన్ టెస్టులో మరోసారి డీఆర్ఎస్ వివాదం తెరపైకి వచ్చింది!. శ్రీలంక ఆల్రౌండర్ దిల్రువన్ పెరీరా తొలుత మహ్మద్ షమి బౌలింగ్లో ఎల్బీగా అవుటయ్యాడు. అంపైర్ నిగెల్ అవుట్ సిగల్తో పెరీరా డ్రెస్సింగ్రూమ్ వైపు వెళ్లాడు. కానీ మధ్యలోనే ఆగిన పెరీరా (34 బంతుల్లో 5 రన్స్) వెనక్కి వచ్చి.. రివ్యూ కోరాడు. షమి బంతి వికెట్లను గిరాటేసినా, బంతి ఆఫ్ స్టంప్కు కాస్త ఆవల పడటంతో పెరీరా మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈ సమయంలో ఏడు బంతుల్లో పరుగులేమీ చేయని పెరీరా..తర్వాత కీలక భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. హెరాత్తో ఎనిమిదో వికెట్కు 48 పరుగులు జోడించాడు. పెరీరా పెవిలియన్ వైపు వెళ్తూ, తిరిగి వెనక్కి వచ్చి రివ్యూ కోరటంపై రగడ రాజుకున్నది. ఐసీసీ నిబంధనల ప్రకారం సహచర బ్యాట్స్మన్ సలహా తీసుకోవచ్చు, ఆటగాడు తనే స్వీయ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ డ్రెస్సింగ్రూమ్ నుంచి సలహా తీసుకోవటానికి వీల్లేదు. పెరీరా వెనక్కి వెళ్తూ డ్రెస్సింగ్రూమ్ సంజ్ఞల మేరకు రివ్యూ కోరాడు. అయితే, ఈ విషయంలో టీమ్ ఇండియా హుందాగా వ్యవహరించింది. పెరారీ నిర్ణయంలో డ్రెస్సింగ్రూమ్ ప్రమేయం లేదని, రివ్యూలు లేవని పెరీరా వెళ్తుండగా హెరాత్ అంపైర్తో వాకబు చేశాడని, అప్పుడే పెరీరా రివ్యూ కోరాడని శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఘటన ఈ ఏడాది ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ను గుర్తుచేయటంతో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల పాకిస్థాన్తో అబుబాది టెస్టులోనూ శ్రీలంక బ్యాట్స్మన్ కుశాల్ మెండిస్ పెవిలియన్కు చేరుకుంటూ, మళ్లీ వెనక్కి వచ్చి రివ్యూ కోరాడు. కానీ అప్పుడు నిర్ణయం లంకకు అనుకూలంగా రాలేదు.