Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల యూత్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్
గౌహతి : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో అమ్మాయిలు అదరగొడుతున్నారు. బుధవారం వివిధ కేటగిరీల్లో ఏడుగురు క్వార్టర్స్ బరిలో దిగగా వారిలో ఐదుగురు సెమీస్ చేరుకున్నారు. మరో ఇద్దరూ స్వల్ప సంఖ్యలో క్రీడాకారులుండటంతో నేరుగా సెమీస్కు అర్హత సాధించారు. దీంతో ఓడినా, గెలిచినా మొత్తంగా ఏడు పతకాలు భారత్కు దక్కనున్నాయి. జ్యోతి గులియా (51 కిలోలు), శశి చోప్రా (57 కిలోలు), బోరో అంకుషిత (64 కిలోలు), నీతు (45-48 కిలోలు), సాక్షి చౌదరి (54 కిలోలు) విభాగాల్లో క్వార్టర్స్ బరిలో విజయాలు సాధించి సెమీస్లో ప్రవేశించారు. నేహ యాదవ్ (ప్లస్ 81 కిలోలు), అనుపమ (81 కిలోలు)విభాగాల్లో నేరుగా సెమీస్లో పోటీ పడనున్నారు.