Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్లో మార్టినెజ్పై విజయం
బెంగళూరు:స్వదేశంలో జరుగుతున్న టెన్నిస్ సమరంలో భారత టాప్ టెన్నిస్ ఆటగాడు యుకీ బాంబ్రీ సత్తా చాటుతు న్నాడు. వరుస సెట్లలో విజయాలు అందుకుంటూ క్వార్టర్స్కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన ప్రీ క్వార్టర్స్ పోరులో మార్జినెజ్ పోర్టెరో (స్పెయిన్)ను 6-2, 7(7)-6(0)తో ఓడించాడు. తొలి గేమ్ సులువుగా నెగ్గిన యుకీకి రెండో సెట్లో తడబడగా ఫలితం కోసం టై బ్రేకర్ ద్వారా తేలింది. టైబ్రేకర్లో ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా 7-0తో టై బ్రేకర్లో నెగ్గాడు. క్వార్టర్స్లో మూడో సీడ్ యుకీ, ప్రజ్ఞన్ గుణేశ్వరన్తో తలపడనున్నాడు. ప్రీ క్వార్టర్స్లో ప్రజ్ఞన్ మార్క్ పోల్మాస్ (ఆస్ట్రేలియా)ను 6-2, 6(1)-7(7), 6-1తో ఓడించాడు. ఐదో సీడ్ రామ్కుమార్ రామనాథన్, జే క్లార్క్్ (ఇంగ్లాండ్) చేతిలో 7(7)-6(3), 2-6, 4-6తో ఓడి ఇంటిముఖం పట్టాడు. ఇంగ్లాండ్ ఆటగాడు బ్రైడన్ క్లెయిన్పై 6-4, 4-6, 7-5తో గెల్చిన సుమీత్ నాగల్ క్వార్టర్స్లో బెర్త్్ ఖాయం చేసుకున్నాడు. డబుల్స్లో టాప్ సీడ్ దివిజ్ శరణ్ జోడీ సహా విష్ణువర్థన్ జోడీలు సెమీస్లో అడుగుపెట్టాయి.