Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాషెస్ సిరీస్ తొలి టెస్టు
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) : యాషెస్ తొలి టెస్టు మొదటి రోజు ఉత్కంటభరితంగా సాగింది. ఆసీస్ బౌలర్లు చెలరేగటంతో నాల్గు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ 196 పరుగుల స్వల్ప స్కోరురే పరిమితమైంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న అతిథులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలిస్టర్ కుక్ (2)ను మిచెల్ స్టార్క్ పెవిలియన్ బాట పట్టించాడు. మరో ఓపెనర్ మార్క్ స్టోన్మన్ (53) అర్ధశతకం చేసి ఫర్వాలేదనిపించాడు. వన్డౌన్లో వచ్చిన జేమ్స్ విన్సీ (83) రాణించి ఇంగ్లాండ్ స్కోరు బోర్డును ముందుకురికించాడు. ఈ జోడీ రెండో వికెట్కు 125 పరుగల విలువైన భాగస్వామ్యాన్ని జోడించింది. పాట్ కమిన్స్ బౌలింగ్లో స్టోన్మన్ బౌల్డ్ అవటంతో పార్ట్నర్షిప్కు తెరపడింది. నాథన్ లైయన్ చేతిలో రనౌట్ అయిన విన్సీ క్రీజును విడిచిపెట్టడంతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డు నెమ్మదించింది. కెప్టెన్ జో రూట్ (15) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దావీద్ మలన్ (28 నాటౌట్), మోయిన్ ఆలీ (13 నాటౌట్) మైదానంలో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్కు రెండు వికెట్లు దక్కగా, మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీశాడు. నాథన్ లైయన్ పొదుపుగా బంతులేసి ఆకట్టుకున్నాడు.