Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలోని వివిధ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 50 మంది బాలురకు మహేశ్ భూపతి టెన్నిస్ అసోసియేషన్ (ఎమ్బీటీఏ) తరఫున టెన్నిస్ శిక్షణ శిబిరం నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ శిబిరంలో చిన్నారులకు టెన్నిస్ మెళకువలు నేర్పించారు. కార్యక్రమంలో ఎమ్బీటీఏ హెడ్ కోచ్లు శరద్ కుమార్, చార్లొట్ విట్బై కోల్స్ ఐఐఎఫ్ఎల్ సీఈఓ డా. సారికా కులకర్ణి పాల్గొన్నారు.