Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్లో ప్రజ్ఞన్పై 2-0తో గెలుపు
- బెంగళూర్ ఏటీపీ చాలెంజర్
బెంగళూర్ : భారత టెన్నిస్ ప్లేయర్ యుకీ బాంబ్రీ బెంగళూర్ ఓపెన్ సెమీస్లో అడుగుపెట్టాడు. గురువారం జరిగిన క్వార్టర్స్ పోరులో సహచర భారత ఆటగాడు ప్రజ్ఞన్ గుణేశ్వరన్ను 7-5, 6-2తో వరుస సెట్లలో ఓడించాడు. తొలి సెట్లో ప్రజ్ఞన్ నుంచి కాస్త పోటీ ఎదురైనా.. రెండో సెట్లో యుకీ కష్టపడ కుండానే నెగ్గాడు. ఫైనల్లో స్థానం కోసం సుమీత్ నాగల్తో యుకీ తలపడను న్నాడు. ఇదే రోజు జరిగిన మరో క్వార్టర్స్ సమరంలో సుమీత్ నాగల్ టాప్ సీడ్ (స్లోవేనియా) బ్లేజ్ కావ్చిక్ను 6-3, 6-4తో కంగు తినిపించాడు. డబుల్స్లో టాప్ సీడ్ దివిజ్ శరణ్ జోడీ 6-4, 4-6, 10-8తో భారత జంట విష్ణువర్థన్, బాలాజీలపై గెల్చి ఫైనల్కు చేరుకున్నది.