Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్లో ఓహొరిపై 2-0తో సునాయాస విజయొం సైనా, ప్రణయ్ నిష్క్రమణ
- హాంగ్కాంగ్ ఓపెన్
కౌలూన్ : ఒలింపిక్ సిల్వర్ స్టార్ పి.వి సింధు హాంగ్కాంగ్ సూపర్ సిరీస్ క్వార్టర్స్లో ప్రవేశించింది. ప్రీ క్వార్టర్స్ పోరులో జపాన్ యువతి అయా ఓహొరిపై 21-14, 21-17తో అలవోకగా గెలిచింది. మరో మ్యాచ్లో హైదరాబాదీ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు చుక్కెదురైంది. ఎనిమిదో సీడ్ చెన్ యుఫెరు చేతిలో 21-18, 19-21, 10-21తో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో భారత్ పోరాటానికి తెరపడింది. ఆశల భారం మోస్తాడనుకున్న హెచ్.ఎస్ ప్రణరు 21-11, 10-21, 21-15తో కజుమాస సకారు చేతిలో ఓడి ఇంటిముఖం పట్టాడు. గత వారం జరిగిన చైనా ఓపెన్లోనూ సింధు, సైనా, ప్రణరులు ప్రీ క్వార్టర్స్ చేరుకోగా.. సింధు ఒక్కతే క్వార్టర్స్ గడప దాటింది. సైనా, ప్రణరులకు నిరాశే మిగిలింది.
హాంగ్ కాంగ్ బరిలో రెండో సీడ్ సింధు గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్ పోరును 39 నిమిషాల్లో ముగించింది. రెండు సెట్లలోనే ప్రపంచ 13వ ర్యాంకర్ అయా ఓహొరిని మట్టికరిపించింది. తొలి సెట్లో 0-2తో వెనుకబడిన తెలుగు తేజం 5-5తో స్కోరు సమం అయ్యాక కుదురుకున్నది. వరుస పాయింట్లు సాధిస్తూ 9-5తో నిలిచింది. 10-11తో ఓహొరి పోటీలోకొచ్చే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. 21-14తో తొలి సెట్ సింధు వశమైంది. 0-1తో రెండో సెట్ను ఆరం భించి 2-1తో ఆధిక్యంలో చేజిక్కించుకున్నది. చివరి దాకా ఆధిపత్యాన్ని చలాయించి 21-17తో రెండో సెట్నూ క్వార్టర్స్ బెర్త్నూ దక్కించుకున్నది. సెమీస్లో స్థానం కోసం ఐదో సీడ్ జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచితో తలపడనున్నది. గురువారం వెలువడిన బిడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో ఒక మెట్టు దిగిన హైదరాబాదీ ప్రస్తుతం మూడో ర్యాంకులో కొనసాగుతున్నది.