Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్ల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఐపీఎల్ ఆదాయం సహా మీడియా హక్కుల వేలంతో బీసీసీఐ ఖజానా నిండుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆటగాళ్ల జీతాలకు కేటాయిస్తున్న మొత్తానికి అదనంగా మరో రెండొందల కోట్లు చేర్చి, వచ్చే సీజన్లో వేతన విధానంలో మార్పు చేయాల్సిందిగా సుప్రీం నియమిత పాలకుల కమిటీ (సీఓఏ) బీసీసీఐకు ప్రతిపాదనలు పంపనున్నది. ఇదే గనక జరిగితే వేతనాల కోసం బీసీసీఐ రూ.380 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వేతనాలకు కేటాయించిన మొత్తం రూ.180 కోట్లు కాగా తాజా సమాచారం మేరకు ఇది రెండింతలు కానున్నది. దీంతో సీనియర్ క్రికెటర్ల జీతాలు రెండింతలయ్యే అవకాశమున్నది. టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లి వేతనం రూ. 10 కోట్లకు పెరుగుతుంది. రంజీ వంటి దేశవాళీ టోర్నీల్లో ఆడే క్రికెటర్ల జీతాలు సైతం ఇదే స్థాయిలో పెరగనున్నాయి.