Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్×ఢిల్లీ
- కర్నాటక×విదర్భ
పుణె : గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ, మనోజ్ తివారి సారథ్యంలోని బెంగాల్ జట్లు నేటి నుంచి ఇక్కడ జరుగనున్న రంజీ తొలి సెమీస్ పోరులో తలపడనున్నాయి. పేసర్ షమి, గంభీర్ల మధ్య ప్రధాన పోటీ ఉండనున్నది. సీజన్లో ఇప్పటికే గంభీర్ 505 పరుగులు చేసి ఫామ్లో ఉన్నాడు. 2009-10 సీజన్ నుంచి ఒక్కసారి కూడా బెంగాల్ ఢిల్లీపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది లేదు. బ్యాట్స్మెన్కు కలిసొచ్చే మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్లు వీలైనన్ని పరుగులు రాబట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంతో కనిపిస్తున్నాయి. మరో పక్క కోల్కత వేదికగా కర్నాటక, విదర్బ జట్ల మధ్య రెండో సెమీస్ సమరం జరగన్నుది. సీజన్లో ఆసాంతం అంచనాలకు మించిన ప్రదర్శన చేసిన విదర్భ, కర్నాటకతో ఢ కొట్టనుండటంతో పోరు రసవత్తరం కానున్నది. భారత్ తరఫున లంకతో టీ20 సిరీస్కు ఎంపికైన కెఎల్ రాహుల్, మనీశ్ పాండే లేని లోటు కర్నాటక జట్టులో కలవరం రేపుతున్నది. అగర్వాల్ సారథ్యంలో బ్యాటింగ్, వినరుకుమార్ నేతృత్వంలో బౌలింగ్ బృందంతో కర్నాటక ధీమాగానే ఉన్నా.. విదర్భను తక్కువ అంచనా వేయలేం. ఉమేష్ యాదవ్ విదర్భకు బంతితో బలం చేకూర్చనున్నాడు.