Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ పట్నం : నగరంలోని ఓ హోటల్ 12 మంది దేశవాళీ అంపైర్లతో బీసీసీఐ వర్క్షాప్ నిర్వహించింది. 'డీఆర్ఎస్' పరిజ్ఞానం, నియమాలు తదితర అంశాలపై అంపైర్లకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ వర్క్షాప్ జరిగింది. ఐసీసీ అంపైర్ల కోచ్ డెనిస్ బర్న్స్, అంపైర్ అవతారమెత్తిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాల్ రెయిఫెల్లు వర్క్షాప్లో పాల్గొన్న అంపైర్లను ఉద్దేశించి మాట్లాడారు. డీఆర్ఎస్ (డిసిషన్ రివ్యూ సిస్టమ్) పనితీరు, సంబంధిత ప్రొటోకాల్స్ను అంపైర్లకు వివరించారు. 'సెమినార్ బాగా జరిగింది. డీఆర్ఎస్ సంబంధిత అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు. భవిష్యత్ అంతా టెక్నాలజీదే. దాన్ని మనం అందిపుచ్చు కోవాలి. క్రీడల్లో టెక్నాలజీ పరమైన విషయా లను అవలోకనం చేసుకోవటం మంచిదే.' అని వర్క్షాప్లో పాల్గొన్న అంపైర్ ఒకరు అన్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్లో తొలిసారి డీఆర్ఎస్ అమలుపరిచే అవకాశం ఉండ టంతో.. తాజా వర్క్షాప్ నిర్వహణ ప్రాధా న్యత సంతరించుకున్నది. అంతర్జాతీయ టోర్నీలో అంపైర్లుగా నిర్వహించే వారికి ఇలాంటి వర్క్షాప్ నిర్వహించటం ఇదే తొలి సారి అని బీసీసీఐ ఉన్నతాధికారి తెలిపారు.