Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 146 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
- యాషెస్ మూడో టెస్టు మూడో రోజు
పెర్త్ : వాకా మైదానంలో పరుగుల వరద పారుతోంది. తొలి ఇన్నింగ్స్లో డావిడ్ మలన్, బెయిర్ స్టోలు ఇంగ్లాండ్ తరఫున సెంచరీలు బాదగా.. మూడో రోజు కంగారూల సారథి స్టీవెన్ స్మిత్ (229 బ్యాటింగ్, 390 పరుగుల్లో 28 ఫోర్లు, ఓ సిక్స్) అజేయ ద్వి శతకం బాదేశాడు. మూడో రోజు షాన్ మార్ష్ వికెట్ మాత్రమే కోల్పోయిన ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. స్మిత్ డబుల్ ధమాకాకు లోయర్ ఆర్డర్లో బ్యాట్ పట్టిన ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ (181, 234 బంతుల్లో 29 ఫోర్లు) ధనాధన్ అజేయ సెంచరీ తోడయింది. వీరిద్దరు 301 పరుగుల భారీ భాగస్వామ్యంనెలకొల్పారు. దీంతో మూడో రోజు ఆటముగిసే సమయానికి నాల్గు వికెట్ల నష్టానికి 549 పరుగులు చేసిన కంగారూల సేన 146 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో నిర్దేశించిన 403 పరుగుల ఛేదనలో ఆసీస్ మూడు వికెట్లు కోల్పోయి 203 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించింది. మైదానంలోకి దిగగానే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ స్మిత్ రెండో డబుల్ సెంచరీ సాధించాడు. 1971 తర్వాత యాషెస్లో ద్విశతకం నమోదు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందే షాన్ మార్ష్ వెనుదిరగటంతో క్రీజులోకొచ్చిన మిచెల్ మార్ష్్ ఫోర్లతో విజృంభించి సెంచరీ సాధించాడు. సగటున 77 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడ్డ మిచెల్ డబుల్ సెంచరీపై కన్నేశాడు. ద్వి శతకానికి కేవలం 19 పరుగుల దూరంలో నిలిచాడు. ఇప్పటకే 2-0తో సిరీస్పై పట్టు సాధించిన ఆసీస్ మూడో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోన్నది.