Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తొలి వుషు శాండ ఏషియన్ కప్లో భారత్కు పది పతకాలు దక్కాయి. కోచ్ రాజ్వీర్ సింగ్ శిక్షణలోని భారత బృందం వుషు శాండ (చైనీస్ కిక్ బాక్సింగ్)లో అసాధారణ ప్రతిభ కనబర చింది. చైనాలోని గ్వాన్ గ్జౌలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో రాజేందర్ సింగ్ (90కిలోలు), ముఖేశ్ చౌదరి, విశాఖపట్నం మాలిక్ (70 కిలోలు), అరున్పమ దేవి (60 కిలోలు), ప్రవీణ్ (48 కిలోలు) విభాగాల్లో రజత పతకాలు సాధించారు. రజనీ దియోరి (75 కిలోలు), పూజా కడియన్ (65 కిలోలు), బుద్ధ చంద్ర సింగ్ (56 కిలోలు), ఉచిత్ శర్మ, సనతోరు దేవి (52 కిలోలు) విభాగాల్లో కాంస్య పతకాలు గెల్చుకున్నారు.