Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెర్త్ : యాషెస్ సిరీస్లో ఇప్పటికే 2-0తో ముందంజలో ఉన్న కంగారూలు మూడో టెస్టుపై పట్టు బిగించి మరో రెండు టెస్టులు మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకునేలా ఉన్నారు. స్మిత్, మిచెల్లు చెలరేగటంతో తొమ్మిది వికెట్లు కోల్పోయి 662 పరుగుల వద్ద ఆసీస్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పర్యాటక జట్టు నాల్గో రోజు ఆటముగిసే సమయానికి నాల్గు వికెట్ల నష్టానికి 132 పరుగులే చేయగల్గింది. 127 పరుగులు వెను కంజలో ఉన్నది. తొలి ఇన్నింగ్స్ హీరోలు మలాన్ (28 బ్యాటింగ్), బెయిర్స్టో (14 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నారు.