Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్
న్యూఢిల్లీ : రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్కుమార్ అంతర్జాతీయ రెజ్లింగ్లోకి అదిరిపోయే పునరాగమనం చేశాడు. జోహన్నస్బర్గ్లో జరుగుతున్న కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించాడు. మూడేండ్ల తర్వాత రెజ్లింగ్ బరిలోకి దిగిన సుశీల్, 74 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో న్యూజిలాండ్ రెజ్లర్ ఆకాశ్ ఖుల్లర్ను మట్టికరిపించాడు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ తర్వాత సుశీల్కు ఇది తొలి అంతర్జాతీయ స్వర్ణం. 'ఇది ఉద్విగభరిత క్షణం. మూడేండ్ల విరామం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం గెలవటం గర్వంగా ఉంది. ఈ పతకాన్ని నా కోచ్కు, నా దేశానికి అంకితమిస్తున్నాను' అని మ్యాచ్ అనంతరం సుశీల్ తెలిపాడు. కాగా ఇదే విభాగంలో మరో భారత రెజ్లర్ పర్వీన్ రానా కాంస్య పతకం నెగ్గాడు.