Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరుణ్ నాయర్ అజేయ శతకం
- బెంగాల్తో రంజీ సెమీస్ పోరు
కోల్కత : వైస్ కెప్టెన్ కరుణ్ నాయర్ (148 బ్యాటింగ్, 261 బంతుల్లో 20 ఫోర్లు, ఓ సిక్స్) అజేయ శతక ప్రదర్శనతో రంజీ సెమీస్లో 107 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది కర్నాటక. విదర్భను 185 పరుగులకే ఆలౌట్ చేసిన మాజీ చాంపియన్ కర్నాటక తొలి రోజు ఆటముగిసే సమయానికి 36/3తో ఉన్నది. క్రీజులో కుదురుకున్న కరుణ్ నాయర్ రెండో రోజు బెంగాల్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 20 ఫోర్లు సహా ఓ సిక్స్తో చెలరేగిన నాయర్ మూడు సెషన్లపాటు అజేయంగా ఆడాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన రెండో భారత బ్యాట్స్మన్గా ఘనత వహించిన నాయర్కు.. సారథి వినరు కుమార్ (20 బ్యాటింగ్) ఆఖర్లో చక్కటి సహకారం అందించాడు. తొమ్మిదో వికెట్కు ఈ జోడీ 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. వికెట్ కీపర్ గౌతమ్ (73) అర్థ శతకంతో రాణించి కర్నాటక ఇన్నింగ్స్లో కీలకమయ్యాడు. విదర్భ బౌలర్లలో ఉమేష్ యాదవ్ (2/71), రాజ్నీష్ గుర్బానీ (5/90) మినహా ఎవరూ రాణించలేదు.
ఢిల్లీ, బెంగాల్ల మరో సెమీస్ మ్యాచ్లో ఢిల్లీ భారీ ఆధిక్యంపై కన్నేసింది. కునాల్ చండేలా (113), గౌతం గంభీర్ (127) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఛేదనలో కేవలం 15 పరుగుల వెనుకంజలో ఢిల్లీ కొనసాగుతోంది. అంతకు ముందు బెంగాల్ను 286 పరుగలకే కట్టడి చేసిన ఢిల్లీ, రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. నితీష్ రాణా (11 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నాడు. బెంగాల్ బౌలర్లలో అశోక్ దిండా, మహమ్మద్ షమి, బొడ్డుపల్లి అమిత్ తలా ఓ వికెట్ తీసుకుకున్నారు.