Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోహాతక్ : మాజీ ప్రపంచ చాంపియన్ ఎల్ సరితా దేవి జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడితో మెరిసింది. శుక్రవారం జరిగిన 60 కిలోల విభాగంలో పవిత్రపై సునాయస విజయం సాధించింది. మరో సీనియర్ బాక్సర్ సోనియా లాథర్ (57 కిలోలు) స్వర్ణం నెగ్గింది. మణిపూర్కు చెందిన సర్జు బాలాదేవి 48 కిలోల విభాగంలో బంగారు పతకం నెగ్గటమే కాక ఉత్తమ బాక్సర్ అవార్డు ట్రోఫీ గెల్చుకున్నది. రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్టుకు ఓవరాల్ చాంపియన్షిప్ దక్కింది.