Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం : ప్రతిష్టాత్మక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్కు వరుసగా రెండో పరాజయం. శుక్రవారం ఇక్కడ ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓడింది. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన రాయుడు సేన నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 129 పరగులు చేసింది. ఛేదనలో రిక్కీ భుయీ (73 నాటౌట్), ధ్వారక రవితేజ (46)లు రాణించటంతో ఆంధ్ర జట్టు గెలుపొందింది. తదుపరి మ్యాచ్లో ఆదివారం తమిళనాడుతో హైదరాబాద్ తలపడనున్నది.