Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడే ఆస్ట్రేలియాతో భారత్ తొలి పోరు
- అండర్ 19 ప్రపంచ కప్
మౌంట్ మాంగనుయి : భారత భావి తారల తొలి పోరు అండర్ 19 ప్రపంచ కప్ తొలి పోరు నేడే. పృథ్వీ షా నేతృత్వంలోని భారత్ గ్రూప్ బి తొలి మ్యాచ్లో కుర్ర కంగారూలను ఢకొీట్ట నున్నది. క్రమశిక్షణకు మారుపేరైన రాహుల్ ద్రవిడ్ శిక్షణలో అత్యుత్తమ ఫామ్తో ఉన్నది యువ భారత్. దేశవాళీ టోర్నీలలో పరుగుల సునామీ, వికెట్ల వరద పారించిన ఆటగాళ్లు.. ఆరంభ మ్యాచ్లో అదర గొట్టాలని ఉవ్విళ్లూరు తున్నారు. జట్టు సిద్ధపాటుపై కెప్టెన్ పృథ్వీ షా మాట్లాడుతూ.. ' గతవారంగా ఇక్కడే ఉంటున్నాం. కొన్ని ప్రాక్టీసు మ్యాచులు సైతం ఆడాం. సిద్ధపాటు బాగుంది. వాతావరణం కూడా అలవాటైంది. ప్రపంచ కప్ గెలవటమే మా లక్ష్యం. అయితే ప్రతి గేమ్ లోనూ మా ఉత్తమ ఆటతీరు కనబరచటానికి ప్రయత్నిస్తాం.' అని తెలిపాడు.