Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా ఓపెన్ రెండో అర్హత పోరులో గెలుపు
మెల్బోర్న్ : భారత టెన్నిస్ ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ ఆస్ట్రేలియా ఓపెన్ ప్రధాన టోర్నీకి విజయం దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన రెండో అర్హత మ్యాచ్లో గ్లెబ్ సకరోవ్ (ఫ్రాన్స్)పై 6-4, 7(12)-6(10)తో గెలుపొందాడు. ప్రత్యర్థి గట్టిపోటీనివ్వగా దాదాపు రెండు గంటలు సాగిన పోరును.. రామ్కుమార్ రెండు గేముల్లోనే ముగించటం విశేషం. 28వ సీడ్ రామ్కుమార్ మ్యాచ్లో అన్సీడెడ్ గ్లెబ్పై 17 ఏస్లు సంధించాడు. ప్రధాన టోర్నీలో అడుగుపెట్టటానికి నేడు రామ్కుమార్.. ఐదో సీడ్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా)తో తలపడనుండగా.. మరో భారత ఆటగాడు యుకీ బాంబ్రీ.. పీటర్ పొలాన్స్కీ (కెనాడా)ను ఢ కొట్టనున్నాడు.