Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1122 మంది క్రికెటర్ల రిజిస్ట్రేషన్
- ఐపీఎల్ వేలం
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. వేలంలో పాల్గొటానికి యువరాజ్ సింగ్, గౌతం గంభీర్ సహా షేన్ వాట్సన్, జో రూట్ వంటి పలువురు స్వదేశీ, విదేశీ క్రికెటర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం 1122 మంది వేలానికి పేర్లు నమోదు చేసుకున్నట్టు బీసీసీఐ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వీరిలో 281 మంది క్యాప్డ్, 838 మంది అన్క్యాప్డ్ ఆటగాళ్లున్నారు. ఈ వేలంలో భారత క్రికెటర్లు స్పిన్నర్ అశ్విన్ రవిచంద్రన్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్ సహా మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ అందుబాటులో ఉన్నారు.
వీరిని ఎవరు కొనుగోలు చేస్తారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కోల్కతా జట్టు గంభీర్ను, హైదరాబాద్ జట్టు యువీను అట్టిపెట్టుకోకుండా వదిలేసిన సంగతి తెలిసిందే. ఆటగాళ్ల జాబితాలను బీసీసీఐ ఆయా ఫ్రాంచైజీలకు పంపించింది. ఐపీఎల్ పదో సీజన్లో పంజాబ్ తరఫున ఆడిన హషీం ఆమ్లా సహా డుప్లెసిస్, మోర్నీ మోర్కెల్, రబాడాలకు వేలంలో అత్యధిక ధర పలికే అవకాశమున్నది.