Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు హైదరాబాద్తో టైటిల్ పోరుకు సై
- సెమీస్లో అహ్మదాబాద్పై 4-3తో గెలుపు
- ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్-3
నవతెలంగాణ క్రీడాప్రతినిధి-గచ్చిబౌలి
నువ్వా నేనా అంటూ ఆద్యంతం ఉత్కంఠ రేపిన పీబీఎల్ రెండో సెమీఫైనల్లో బెంగళూర్ బ్లాస్టర్స్ (సచన్ టెండూల్కర్ సహ యజమాని) మెరిసింది. అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్పై 4-3తో గెలుపొంది టైటిల్ పోరుకు చేరుకున్నది. ఆఖరి మ్యాచ్ వరకూ సాగిన సెమీస్లో సిక్కి రెడ్డి, కిమ్ స రంగ్లు మిక్స్డ్ డబుల్స్లో మెరుపు విజయంతో బెంగళూర్ను ఫైనల్స్కు చేర్చారు. బెంగళూర్ తరఫున అగ్రశ్రేణి షట్లర్ విక్టర్ అక్సెల్సన్ కీలక ప్రదర్శన చేశాడు. నేడు హైదరాబాద్ హంటర్స్తో బెంగళూర్ బ్లాస్టర్స్ అమీతుమీ తేల్చుకోనున్నది.
ఆద్యంతం ఉత్కంఠ : బెంగళూర్ బ్లాస్టర్స్, అహ్మదా బాద్ స్మాష్ మాస్టర్స్ మధ్య రెండో సెమీఫైనల్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆఖరి మ్యాచ్ వరకూ ఏ జట్టుకూ స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు. దీంతో ఫలితం కోసం మిక్స్డ్ డబుల్స్ వరకూ ఆగక తప్పలేదు. తొలుత మెన్స్ సింగిల్స్ తొలి మ్యాచ్లో అహ్మదాబాద్ బోణీ కొట్టింది. సీనియర్ షట్లర్ చాంగ్ వీ ఫెంగ్ (బెంగళూర్) వరుస సెట్లలో సౌరభ్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యాడు. మూడు గేముల మ్యాచ్లో 15-2, 14-15, 15-10తో సౌరభ్ విజయం సాధించాడు. తర్వాతి మెన్స్ డబుల్స్ను బెంగళూర్ ట్రంప్గా ఎంచుకున్నది. బొయె మథియస్, కిమ్ స రంగ్ జోడీ బెంగళూర్ ఆశలను నిలిపారు. 15-13, 15-12తో కిదాంబి నందగోపాల్, లీ చెన్ హురులపై వరుస సెట్లలో గెలుపొందారు. దీంతో బెంగళూర్ రెండు పాయింట్లు దక్కించుకున్నది. మహిళల సింగిల్స్ను అహ్మదాబాద్ ట్రంప్గా ఎంచుకోగా.. వరల్డ్ నెం.1 తైజు యింగ్ సూపర్ ప్రదర్శన చేసింది. స్కాట్లాండ్ అమ్మాయి క్రిస్టీ గిల్మర్ పోరాడినా.. తైవాన్ స్టార్ను నిలువరించలేదు. మూడు గేముల ఈ మ్యాచ్లో 8-15, 15-13, 15-8తో తైజు యింగ్ గెలుపొందింది. దీంతో అహ్మదాబాద్కు రెండు పాయింట్లు లభించాయి. తొలి మూడు మ్యాచులు ముగిసే సరికి అహ్మదాబాద్ 3-2తో ముందంజ వేసింది. కీలక మెన్స్ సింగిల్స్ రెండో మ్యాచ్లో అగ్రశ్రేణి షట్లర్ విక్టర్ అక్సెల్సన్ బెంగళూర్కు వరుస సెట్ల విజయాన్ని అందించాడు. అహ్మదాబాద్ ఆటగాడు హెచ్.ఎస్ ప్రణరు ఆకట్టుకున్నా.. విక్టర్ను అడ్డుకోలేదు. 15-11, 15-14తో నెగ్గిన విక్టర్ స్కోర్లు సమం చేశాడు. నాల్గు మ్యాచులు పూర్తయ్యేసరికి ఇరు జట్లూ 3-3తో సమవుజ్జగా నిలిచాయి. ఐదో మ్యాచ్, మిక్స్డ్ డబుల్స్ పోరు విజేతను నిర్ణయించింది. సిక్కి రెడ్డి-కిమ్ స రంగ్ (బెంగళూర్), కమిల, లా హిమ్ (అహ్మదా బాద్)లు నువ్వా నేనా అన్నట్టు తలపడ టంతో ఈ మ్యాచ్ సైతం మూడో గేమ్కు దారితీసింది. తొలి గేమ్లో 15-12తో బెంగళూర్ నెగ్గగా, రెండో గేమ్లో 15-13 తో అహ్మదాబాద్ పైచేయి సాధించింది. ఫైనల్స్ బెర్త్ను నిర్ణయించే మూడో గేమ్లో విరామ సమ యానికి 8-6తో బెంగళూర్ ముందంజ వేసింది. ద్వితీయా ర్థంలోనూ సిక్కి రెడ్డి, కిమ్ స రంగ్లు మెరవ టంతో 15-9తో బెంగళూర్ గెలుపొందింది. పీబీఎల్ ఫైనల్స్ బెర్త్ దక్కించుకున్నది.
నేడు పీబీఎల్ ఫైనల్ పోరు : పీబీఎల్ లీగ్ దశలో ఎదుర్కొన్న ఆఖరి ప్రత్యర్థితో హైదరాబాద్ హంటర్స్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. రెండు జట్లలోనూ అగ్రశ్రేణి షట్లరు ఉండటంతో నేడు తుది పోరుపై ఆసక్తి రెట్టింపు అవుతోంది. హైదరాబాద్ తరఫున కరొలినా మారిన్, సాయి ప్రణీత్ సహా డబుల్స్ స్పెషలిస్ట్లు ఉన్నారు. బెంగళూర్లో విక్టర్ అక్సెల్సన్, క్రిస్టీ గిల్మర్లు కీలకం కానున్నారు.