Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లి సేన విజయ లక్ష్యం 252 పరుగులు
- రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 258/10, భారత్ 35/3
- మెరిసిన షమి, ఇషాంత్
- సెంచూరియన్ టెస్టు నాల్గో రోజు
సెంచూరియన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు కోహ్లి (153) మెరుపులతో భారత్ పోటీలో నిలువగా.. నాల్గో రోజు మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మల మెరుపులతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 258 పరగులే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంగేట్ర కుర్రాడు ఎంగిడి ఆదిలోనే మోకాలడ్డాడు. 35 పరుగులకే ఓపెనర్లు సహా విరాట్ కోహ్లి వికెట్ కోల్పోయింది భారత్. దీంతో ఆఖరు రోజు లక్ష్యాన్ని ఛేదించి భారత్ సిరీస్లో సమంగా నిలుస్తుందా? కోహ్లి సేన నిలకడగా ఆడి వికెట్లు కాపాడుకుంటే డ్రాగా ముగుస్తుందా? అన్న ఆసక్తి నెలకొన్నది.
నవతెలంగాణ-సెంచూరియన్
తొలి ఇన్నింగ్స్లో కోహ్లి (153) శతాధిక స్కోరుతో భారత్ విజయావకాశాలను సజీవంగా నిలుపగా, నాల్గో రోజు బౌలర్లు మెరిశారు. బుమ్రా సఫారీ టాప్ ఆర్డర్ను దెబ్బ తీయగా మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మలు రాణించటంతో రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 258 పరుగుల చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని భారత్కు 286 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఛేదనలో భారత్క ఆదిలోనే చుక్కెదురైంది. ఆరంగేట్ర బౌలర్ లుంగి ఎంగిడి కోహ్లి, కేఎల్ రాహుల్ల వికెట్లు పడగొట్టి భారత్ను ఒత్తిడిలో పడేశాడు. నాల్గో రోజు ఆటముగిసే సమయానికి 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన భారత్ 35 పరగులు చేసింది. కోహ్లి సేన రెండో టెస్టు గెలవాలంటే 252 పరుగుల కోసం నేడు ఆట కొనసాగించనుండగా.. సఫారీలు ఏడు వికెట్ల కోసం ఆడనున్నారు.
షమి, ఇశాంత్ మెరుపులు : ఓవర్నైట్ స్కోరు 90/2తో సఫారీలు రెండో ఇన్నింగ్స్ కొనసాగిం చారు. క్రీజులో ఉన్న డివిలియర్స్, ఎల్గర్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ జోడీ మూడో వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. భారత పేసర్ మహమ్మద్ షమి ఈ విధ్వంసక జోడీని విడదీశాడు. తొలుత ఏబీ డివిలియర్స్ (80) వికెట్ను పడగొట్టగా, ఆపై డీన్ ఎల్గార్ (61)ను పెవీలియన్ బాటపట్టించాడు షమి. ఆపై వచ్చిన క్వింటన్ డికాక్ (12) సైతం షమి బౌలింగ్లోనే క్రీజును వీడాడు. భోజన విరామానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 173 పరుగులతో నిలిచింది. సారథి డుప్లెసిస్, వెర్నర్ ఫిలాండర్ ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును ముందుకు నడిపించారు. విభిన్నంగా స్పందిస్తోన్న పిచ్పై ఈ జోడీ భారత బౌలర్ల ఇబ్బంది పెట్టారు. రెండో సెషన్లో ఆట నత్తనడకన సాగగా.. 10 ఓవర్లలో 19 పరుగులే రాబట్టారు సఫారీలు. 74 ఓవరో పేసర్ ఇషాంత్ శర్మ వరుస వికెట్లతో మెరిశాడు. ఆ ఓవర్ నాల్గో బంతికి ఫిలాండర్ (26)ను ఔట్ చేశాడు. రెండు ఓవర్ల వ్యవధిలో కేశవ్ మహరాజ్ (6)ను బలిగొన్నాడు. టీ విరామానికి 82 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 230 పరుగుల చేసింది డుప్లెసిస్ సేన. ఓపెనర్ల పనిపట్టిన బుమ్రా బంతికి డుప్లెసిస్ వెనుదిరగగా వెనువెంటనే మిగిలిన వికెట్లు సైతం కూలాయి. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 258 పరగులు చేసింది.
ఆదిలోనే తడబాటు: ఛేదనలో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మురళీ విజరు (9), కేఎల్ రాహుల్ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతాడ నుకున్న విరాట్ కోహ్లి (5) ఎంగిడి బౌలింగ్లో ఎల్బిగా వెనుదిరిగాడు. ఆటముగిసే సమయా నికి చటేశ్వర్ పుజారా (11 బ్యాటింగ్), పార్థివ్ పటేల్ (5బ్యాటింగ్) అజేయంగా కొనసాగుతు న్నారు. నేడు లక్ష్యాన్ని ఛేదించకపోయినా.. భారత్ వికెట్లు కాపాడుకుంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశమున్నది.
కోహ్లికి జరిమానా
మైదానంలో టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లి దూకుడు అంద రికీ తెలిసిందే. భావోద్వేగాల నియంత్రణలో అప్పుడప్పుడు పరుగు ల యంత్రం విఫలమవుతుంటాడు. తాజా సెంచూరియన్ టెస్టు లోనూ కోహ్లి సహనం కోల్పోయిన ఘటన చోటు చేసుకున్నది. ఔట్ ఫీల్డ్ బాలేదంటూ పలు మార్లు కోహ్లి అంపైర్ మైఖేల్కు ఫిర్యాదు చేశాడు. అయితే అంపైర్.. కోహ్లితో ఏకీభవించలేదు. దీంతో కోపగించిన కోహ్లి బంతిని నేలకేసి కొడుతూ అసహనాన్ని వ్యక్తపరిచాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఐసీసీ.. క్రమ శిక్షణా నియమావళి కోడ్ 2.1.1ను కోహ్లి ఉల్లంఘించినం దున అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది.
బ్రాడ్మన్ రికార్డు సమం
ఆసీస్ మాజీ క్రికెటర్ డాన్ బ్రాడ్మన్ రికార్డును పరుగుల యంత్రం కోహ్లి సమం చేశాడు. సెంచూరియన్ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో కోహ్లి 153 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఇప్పటిదాకా తొమ్మిదిసార్లు విరాట్ 150కి పైగా పరుగులు చేశాడు. అందులో ఎనిమిది సార్లు కెప్టెన్గా ఈ ఘనత సాధించిన కోహ్లి.. డాన్ బ్రాడ్మన్ రికార్డు అందుకున్నాడు.
సాహా స్థానంలో దినేశ్ కార్తీక్
దక్షిణాఫ్రికాతో ఈ నెల 24 నుంచి జరుగనున్న చివరి టెస్టుకు దినేశ్ కార్తీక్ అందుబాటులో ఉండనున్నాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ప్రాక్టీసు సెషన్లో గాయపడటంతో అతని స్థానంలో దినేశ్ కార్తీక్ జట్టులోకి రానున్నట్టు సెలక్షన్ కమిటీ తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్వీటర్ ద్వారా వెల్లడించింది. బీసీసీఐ పిలుపుతో దినేశ్ దక్షిణాఫ్రికా బయలుదేరాడు.
స్కోరు వివరాలు :
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 335/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : 307/10
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : ఏడెన్ మార్క్రం ఎల్బి (బి) బుమ్రా 1, డీన్ ఎల్గార్ (సి) రాహుల్ (బి) షమి 61, హషీం ఆమ్లా ఎల్బి (బి) బుమ్రా 1, ఏబీ డివిలియర్స్్ (సి) పార్థివ్ పటేల్ (బి) షమి 80, డుప్లెసిస్ (సి,బి) బుమ్రా 48, క్వింటన్ డికాక్ (సి) పార్థివ్ పటేల్ (బి) షమి 12, వెర్నన్ ఫిలాండర్ (సి) విజరు (బి) ఇషాంత్ 26, కేశవ్ మహరాజ్ (సి) పార్థివ్ పటేల్ (బి) ఇషాంత్ 6, కగిసో రబాడా (సి) కోహ్లి (బి) షమి 4, మోర్నీ మోర్కెల్ నాటౌట్ 10, లుంగిని ఎంగిడి (సి) విజరు (బి) అశ్విన్ 1, ఎక్స్ట్రాలు 8, మొత్తం : (91.3 ఓవర్లలో 10 వికెట్లకు) 258.
వికెట్ల పతనం : 1-1, 3-2, 3-144, 4-151, 5-163, 6-209, 7-215, 8-245, 9-245, 10-258.
బౌలింగ్ : రవిచంద్రన్ అశ్విన్ 29.3-6-78-1, జశ్ప్రీత్ బుమ్రా 20-3-70-3, ఇషాంత్ శర్మ 17-3-40-2, మహమ్మద్ షమి 16-3-49-4, హార్దిక్ పాండ్య 9-1-14-0.
భారత్ రెండో ఇన్నింగ్స్ : మురళీ విజరు (బి) రబాడా 9, లోకేష్ రాహుల్ (సి) మహరాజ్ (బి) లుంగి ఎంగిడి 4, చటేశ్వర్ పుజారా బ్యాటింగ్ 11, విరాట్ కోహ్లి ఎల్బి (బి) లుంగి ఎంగిడి 5, పార్థివ్ పటేల్ బ్యాటింగ్ 5, ఎక్స్ట్రా 1, మొత్తం : (23 ఓవర్లలో 3 వికెట్లకు) 35.
వికెట్ల పతనం : 1-1, 2-16, 3-26.
బౌలింగ్ : వెర్నన్ ఫిలాండర్ 6-3-6-0, కగిసో రబాడా 5-2-9-1, లుంగిసాని ఎంగిడి 6-2-14-2, మోర్నీ మోర్కెల్ 5-3-4-0, కేశవ్ మహరాజ్ 1-0-1-0.