Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జపాన్పై 6-0తో భారత్ విజయం
న్యూఢిల్లీ : నాల్గు దేశాల హాకీ ఇన్విటేషనల్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. తొల పోరులోనే జపాన్ను 6-0తో కంగుతినిపిం చింది. ఆరంభంలోనే రుపీందర్ సింగ్, అరంగేట్ర ఆటగాడు వివేక్ సాగర్ ప్రసాద్లు గోల్స్తో భారత్ను ఆధిపత్యంలో నిలిపారు. పటిష్ట డిఫెన్సుతో బరిలోకి దిగిన భారత్ ప్రత్యర్థికి ఒక్క గోల్నూ కోల్పోలేదు. ప్రథమార్థంలో జపాన్కు ఒక్క అవకాశం ఇవ్వలేదు. విరామానంతరం జపాన్ పుంజుకుని గోల్ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. భారత గోల్ కీపర్ పాఠక్ వారి ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. రూపీందర్ పాల్ సింగ్ ఏడో నిమిషంలో పెనాల్టీ గోల్తో భారత్ గోల్స్ ఖాతా తెరిచాడు. 15 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టిన వివేక్ భారత్కు 3-0 ఆధిక్యాన్నిచ్చాడు. ద్వితీయార్థంలో మరో ఆరంగేట్ర ఆటగాడు దిల్ప్రీత్ సింగ్ ఓ గోల్, హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయటంతో భారత్ 6-0 విజయాన్ని సొంతం చేసుకున్నది.