Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రమంత్రి రాజ్యవర్థన్సింగ్కు సాట్స్ చైర్మెన్ వినతి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
'ఖేలో ఇండియా' పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అర్బన్, సరూర్నగర్ (రంగారెడ్డి) స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలోనూ క్రీడల అభివృద్ధి కోసం సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమబుద్ద యూనివర్సిటీలో నిర్వహించిన 22వ జాతీయ యూత్ ఫెస్టివల్-2018 ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్సింగ్ రాథోర్ను సాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి కలిసారు. పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ... కేంద్రమంత్రిని హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంతో పాటు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్నూ సందర్శించాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా నెహ్రూ యువకేంద్ర సంఘటన్ వైస్ చైర్మెన్ పేరాల శేఖర్రావు ఉన్నారు.