Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జింబాబ్వేపై పది వికెట్ల తేడాతో ఘనవిజయం
- అండర్ 19 ప్రపంచ కప్
మౌంట్ మాంగనుయి : హాట్ ఫేవరెట్గా అండర్ 19 ప్రపంచ కప్ బరిలో దిగిన యువ భారత్, హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ దశ ఆఖరు పోరులో జింబాబ్వేను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి, క్వార్టర్స్ స్థానాన్ని పక్కా చేసుకున్నది. ఆల్రౌండర్ అనుకూల్ సుధాకర్ రారు (4/20) మెరుపులకు ఆర్శ్దీప్ సింగ్ (2/10), అభిషేక్ శర్మ (2/22) జతకలిశారు. దీంతో టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 48.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు హార్విక్ దేశారు (56 నాటౌట్, 73 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), శుభ్మన్ గిల్ (90 నాటౌట్, 59 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచారు. ప్రయోగాత్మకంగా ఓపెనింగ్ చేసిన గిల్, దేశారు రాణించటంతో భారత్ వికెట్లేమీ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. కాగా టోర్నీలో పది వికెట్ల తేడాతో భారత్ గెలుపొందటం ఇది రెండోసారి. ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన గిల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గ్రూప్ బి లో అగ్రస్థానాన ఉన్న భారత్ ఈ నెల 26న బంగ్లాదేశ్తో క్వార్టర్స్ సమరం చేయనున్నది.