Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : హెలికాఫ్టర్ షాట్ల ఆవిష్కర్త ఎం.ఎస్ ధోనిని టీ20ల్లో బంతులేయటం బౌలర్లకు విషమ పరీక్ష. బంతిని బలంగా బాదగల అతికొద్ది మంది ఆటగాళ్లలో మహి ఒకడు. స్పిన్ ఆడటంలో ధోని స్టయిలే వేరు. దీంతో మ్యాచ్లో అతడికి బౌలింగ్ చేయటం కంటే నెట్స్లో అతడికి బంతులేయటమే సంతోషంగా భావిస్తున్నానని కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ అన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో శాంట్నర్ చెన్నై సూపర్ కింగ్స్కు ఆడనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ఆడటం పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మహితో మాట్లాడటం, అతడితో ఆడటమనే ఆలోచన ఉత్సుకతను రేపుతోంది. ధోని, రైనా, జడేజా వంటి అద్భుతమైన ఆటగాళ్లతో డ్రెస్సింగ్రూమ్ పంచుకోవాలని ఎదురుచూస్తున్నానని శాంట్నర్ తెలిపాడు. వేలంలో రూ. 50 లక్షలకు శాంట్నర్ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్నది. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో రెండేండ్ల నిషేధం ముగించుకుని చెన్నై, రాజస్థాన్లు 2018 సీజన్కు ఐపీఎల్లో పునరాగమనం చేయనున్న సంగతి తెలిసిందే.