Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయ్ హజారే నాకౌట్ పోరు
న్యూఢిల్లీ : కాలి మడమ గాయంతో బాధపడిన ఢిల్లీ ఆటగాడు గౌతం గంభీర్ విజరు హజారే వన్డే ట్రోఫీ నాకౌట్ మ్యాచుల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. లీగ్ దశ మ్యాచులకు దూరమైన గంభీర్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ సాధించాడు. దీంతో గురువారం ఆంధ్రాతో జరిగే క్వార్టర్ఫైనల్లో అతడు బరిలోకి దిగనున్నాడు. దక్షిణాఫ్రికాలో తొలి వన్డే సిరీస్ సాధించిన భారత జట్టులో భాగంగా ఉన్న యువ ఆటగాడు శ్రేయాష్ అయ్యర్ ముంబయి తరఫున ఆడనున్నాడు. మరో ఆటగాడు అజింక్య రహానె విశ్రాంతి కావాలని కోరటంతో సెలక్టర్లు అతడికి అనుమతిచ్చారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వివాదం కారణంగా రెండు మ్యాచుల నిషేధానికి గురైన అంబటి రాయుడు విజరు హజారే క్వార్టర్స్ పోరులో తిరిగి హైదరాబాద్కు సారథ్యం వహించనున్నాడు. తొలి క్వార్టర్స్లో కర్ణాటకతో హైదరాబాద్ తలపడనుండగా, రెండో క్వార్టర్స్లో ముంబయి, మహారాష్ట్రలు ఢకొీననున్నాయి. బరోడా, సౌరాష్ట్ర మూడో క్వార్టర్స్లో... ఢిల్లీ, ఆంధ్రాలు నాల్గో క్వార్టర్స్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అన్ని మ్యాచులకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నది. తొలి రెండు క్వార్టర్స్ మ్యాచులు బుధవారం, తర్వాతి రెండు నాకౌట్ మ్యాచులు గురువారం జరుగుతాయి.