Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్కు భారత షట్లర్ల జాబితా విడుదలైంది. హెచ్ఎస్ ప్రణరు, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ప్రణవ్ జెర్రీ చోప్రాలున్న పరుషుల జట్టు కిదాంబి నేతృత్వంలో బరిలో దిగనుండగా, మహిళల జట్టును పివి సింధు నడిపించనున్నది. అమ్మాయిల టీమ్లో సైనా నెహ్వాల్ సహా డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి, గాదె రుత్వికా శివాని ఉన్నారు. 'ఎవర్ని ఎంపిక చేయాలనేదానిపై తీవ్ర కసరత్తు చేసన తర్వాతే ఉత్తమ పది మందిని ఎన్నుకొన్నాం. ఆటగాళ్లందరూ అత్యుత్తమ ఫామ్లో ఉండటంతో ఈసారి గెలుస్తామన్న నమ్మకమున్నది.' అని సెలక్షన్ అనంతరం బారు ప్రధాన కార్యదర్శి అనూప్ నారంగ్ తెలిపారు.