Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా అథ్లెట్ల వస్త్రధారణపై ఐఓఏ నిర్ణయం
న్యూఢిల్లీ : సంప్రదాయ చీర కట్టుకు మహిళా అథ్లెట్లు ఇకపై టాటా చెప్పనున్నారు. క్రీడా పోటీల ప్రారంభోత్సవ పరేడ్లలో చీరలకు బదులుగా కోటు (బ్లేజర్), ప్యాంటు ధరించనున్నారు. ఈ మేరకు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఓ ప్రకటనలో తెలిపింది. అథ్లెట్లను సంప్రదించిన తరువాతే ఈ నిర్ణయానికి వచ్చామని ఐఓఏ అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో జరుగనున్న గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్కు మహిళా అథ్లెట్లు కోటు, ప్యాంటుతో హాజరవనున్నారు. ఐఓఏ అథ్లెట్ల కమీషన్ ప్రధానాధికారి మలావ్ ష్రాఫ్ తాజా నిర్ణయాన్ని స్వాగతించారు. ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రాకు రాసిన లేఖలో.. 'క్రీడ్సోతవాల ఆరంభ, ముగింపు వేడుకలలో ధరించే వస్థ్రాలు (చీరలు) మహిళా అథ్లెట్లకు అసౌకర్యంగా ఉంటున్నాయి. వారి సౌకర్యం కొరకు వస్త్రధారణలో మార్పు చేయటం అభినందనీయం.' అని ష్రాఫ్ పేర్కొన్నారు. షూటర్ హీనా సిధు మాట్లాడుతూ 'మాలో చాలా మందికి చీర కట్టుకోవటం తెలీదు. కోటు, ప్యాంటు ధరించటం వల్ల సమయం ఆదా అవటమే కాక సౌకర్యంగానూ ఉంటుంది. ప్యాంటుకు బదులు స్కర్టులైతే మరీ మంచిది' అని తెలిపింది.