Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్ స్వర్ణ పతకమే లక్ష్యమన్న పివి సింధు
ముంబయి : టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించటమే తన లక్ష్యమని తెలుగు తేజం పి.వి సింధు అన్నది. పతకం రంగు రజతం నుంచి స్వర్ణానికి మార్చుకోగలనన్న ధీమా వ్యక్తం చేసింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్న సింధు 'వచ్చే ఒలింపిక్స్లో నా మెడల్ను బంగారు రంగులోకి మార్చాలనుకుంటున్నా. అదే నా కాల, దాన్ని కచ్చితంగా సాకారం చేసుకొని తీరతాను. ఈ ఏడాది సవాలుతో కూడినది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్ సహా ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్కు సిద్ధమవుతున్నా. షెడ్యూలు క్లిష్టంగా ఉన్నది. అయినప్పటికీ ఒకసారి ఒక టోర్నమెంట్లో మాత్రమే పాల్గొంటా. ఏడాది ముగిసే సరికి నన్ను నేను నెంబర్ వన్ స్థానంలో చూసుకోవాలన్నదే ధ్యేయం.' అని వివరించింది.