Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుల్తాన్ ఆజ్లాన్ షా కప్కు భారత హాకీ జట్టు
న్యూఢిల్లీ : పునరాగమనంలో సీనియర్ ఆటగాడు సర్దార్ సింగ్ భారత హాకీ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. సర్దార్ నేతృత్వంలో 18 మందితో భారత హాకీ జట్టు సుల్తాన్ ఆజ్లాన్ షా కప్లో పాల్గొననున్నది. హాకీ ఇండియా మంగళవారం జట్టు వివరాలు ప్రకటించింది. ఇందులో ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. భారత్ సహా ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆతిథ్య మలేసియా పాల్గొంటున్న టోర్నీ మార్చి 3 నుంచి 10 వరకు జరుగుతుంది. గత రెండు టోర్నీల్లో కుర్రాళ్లకు అవకాశమిచ్చే కారణంగా సర్దార్కు జట్టులో చోటు దక్కలేదు. అయితే మన్ప్రీత్ సింగ్ లేని వేళ అనుభవశాలి సర్దార్ సింగ్ జట్టును నడిపించటంలో సఫలమవుతాడని కోచ్ ష్జార్డ్ మార్జేన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
జట్టు వివరాలు : సూరజ్ కర్కేరా, క్రిషన్ బి పాఠక్ (గోల్ కీపర్లు), అమిత్ రోహిదాస్, దిప్సన్ టిర్కీ, వరుణ్ కుమార్, సురేందర్ కుమార్, నీలం సంజీప్ జెస్, మన్దీప్ మోర్ (డిఫెండర్లు), ఎస్కే ఊతప్ప, సర్దార్ సింగ్ (కెప్టెన్), సుమిత్, నీలకంఠ శర్మ, సిమ్రన్జీత్ సింగ్ (మిడ్ ఫీల్డర్లు), గుర్జంత్ సింగ్, రమన్దీప్ సింగ్, తల్వీందర్ సింగ్, సుమిత్ కుమార్, శిలానంద్ లక్రా (ఫార్వర్డులు).