Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్ వేటలో జోరుమీదున్న కౌర్సేన
- దక్షిణాఫ్రికాకు ఇది చావోరేవో
నవతెలంగాణ-సెంచూరియన్
అంతర్జాతీయ సర్క్యూట్లో కాస్త విరామం వచ్చినా.. లయ, ఫామ్ అందిపుచ్చుకోవటం కష్టమైన విషయం. 2017 ప్రపంచకప్ ముగిసిన తర్వాత సుమారు ఆరు మాసాలు మహిళల క్రికెట్ జట్టు మైదానంలో అడుగుపెట్టలేదు. ఇదే సమయంలో ఇతర జట్లు ద్వైపాక్షిక సిరీస్ల్లో బిజీగా గడిపాయి. దీంతో మన అమ్మాయిల ప్రదర్శనపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ తొలి రెండు వన్డేల్లో తిరుగులేని విజయాలతో మిథాలీసేన ఔరా అనిపించింది. 2-1తో సిరీస్ సాధించి అబ్బురపరిచింది. తాజాగా పొట్టి సిరీస్లోనూ అదే జోరు. తొలి రెండు టీ20ల్లో మెరుపు విజయాలు సాధించి, సిరీస్కు చేరువైంది. హాట్రిక్ విజయం ముంగిట తడబడినా.. ఐదు మ్యాచుల సిరీస్లో మన అమ్మాయిలకు మంచి అవకాశం ఉంది. సఫారీ గడ్డపై ఒకే పర్యటనలో రెండు సిరీస్లు సాధించిన ఏకైక జట్టుగా నిలిచేందుకు మన అమ్మాయిలు మరో విజయం దూరంలోనే ఉన్నారు.
అందరూ అదుర్సే
మెన్స్ జట్టు మాదిరి మహిళల జట్టులోనూ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులతో దిగ్గజ హోదా సాధించిన మిథాలీ రాజ్ తాజా పర్యటనలో జోరుమీదున్నది. వాండరర్స్కు ముందు ఆమె వరుసగా నాల్గు అర్ధ సెంచరీలు కొట్టింది. గత మ్యాచ్లో పరుగులేమీ చేయకున్నా.. నేడు మిథాలీరాజ్ ప్రదర్శనపై జట్టు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నది. యువ ఓపెనర్ స్మృతి మంధాన ప్రతి మ్యాచ్లో నూ అంచనాలను అందుకుం టోంది. భారీ షాట్లతో స్టేడి యాన్ని హోరెత్తించే కెప్టెన్ హర్మన్ప్రీత్ వాండరర్స్లో వాV్ా అనిపించింది. బలమైన షాట్లతో విరుచుకుపడిన కౌర్ తృటిలో అర్ధ సెంచరీ చేజార్చు కున్నది. నేడు కూడా కౌర్ మెరిస్తే సఫారీ బౌలర్లకు ముచ్చెమటలే!. రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూనమ్ సహా పూజ జట్టు ప్రణాళిక ప్రకారం ఆకట్టుకుం టున్నారు.
భారత్ను అడ్డుకోగలరా?
మూడో మ్యాచ్లో విజయంతో సిరీస్పై ఆశలు సజీవంగా నిలుపుకున్న దక్షిణాఫ్రికా.. నేటి మ్యాచ్లో చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్లో ఓడినా సిరీస్ కోల్పోనున్న సఫారీ అమ్మాయిలు.. ఎలాగైనా ఆఖరి మ్యాచ్ వరకూ పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. కెప్టెన్ నికెర్క్ మాత్రమే సఫారీ తరఫున నిలకడగా ప్రదర్శన చేస్తోంది. మిగతా వాళ్లెవరూ ఆశించిన మేరకు ఆడటం లేదు. బౌలింగ్ విభాగంలో మెరుపు వేగంతో షబ్నిం అదరగొట్టినా.. ఆమె ప్రతాపం భారత లోయర్ ఆర్డర్ వరకే పరిమితమైంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్వుమెన్ను షబ్నిం ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. అయినా, సమష్టిగా ఆడితే భారత్ను నిలువరించ గలమనే విశ్వాసం సఫారీల్లో కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : మిథాలీ రాజ్, స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రొడ్రిగస్, వేద కృష్ణమూర్తి, అనుజ పాటిల్, శిఖా పాండే, తనీయ భాటియా, పూజ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్.
దక్షిణాఫ్రికా : లిజెలి లీ, వాన్ నికెర్క్, సునె లుస్, డు ప్రీజ్, చొలె ట్రయాన్, నదినె డి క్లెర్క్, మరిజానె కాప్, షబ్నిం ఇస్మయిల్, మసబట లాస్,
డానియెల్స్, రైసిబి.